తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే .. చిరంజీవిపై పోటి చేయడానికి సిద్ధమని
బాలకృష్ణ స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని
ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బాలకృష్ణ పాడేరులో స్వర్గీయ
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ
తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి
భేదాభిప్రాయాలు లేవన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి
చేస్తానని చెప్పారు. పాడేరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ
వ్యాఖ్యలు చేశారు.కాగా అంతకుముందు తాను ఏ ప్రాంతం నుండి పోటీ
చేసేందుకైనా సిద్ధమని బాలకృష్ణ చెప్పారు. ఆయన విశాఖపట్టణంలో
పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే తాను
ఎక్కడి నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఏ ప్రాంతమైనా తనకు
ఫర్వాలేదన్నారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రజాధరణ ఉందని
చెప్పారు. సినిమాల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఎంతగా ఆదరణ చూపారో అదే ఆదరణ
రాజకీయాల్లోనూ తనపై ప్రజలు చూపాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే
ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పట్టం కట్టడం ఖాయమన్నారు. కాగా బాలయ్య రాక
సందర్భంగా విశాఖలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీలో క్యాడర్లో కొత్త
ఉత్సాహం కనిపించింది. కాగా ఇటీవల బాలకృష్ణ రాజకీయ పర్యటనలు
చేస్తున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు బాలయ్య పక్షం
రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనలో విస్పష్ట ప్రకటన చేశారు. అప్పటి నుండి
పలుమార్లు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి
సందర్భంగా కూడా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎంపీగా కాకుండా అసెంబ్లీ
నుండి పోటీ చేస్తానని చెప్పారు. బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేసినా
స్వాగతిస్తామని ఆయన అభిమానులు, టిడిపి క్యాడర్ చెబుతోంది.

No comments:
Post a Comment