Tuesday, 17 January 2012

బ్యాటింగ్ వైఫల్యమే...కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని


ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా మూడు టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ సేన అడిలైడ్‌లో జరిగే నాలుగవ టెస్టులోనూ కంగారూల చేతిలో ఓటమిపాలైతే చరిత్రలో భారత జట్టు మరోసారి అత్యంత హీనమైన దశకు చేరుకుంటుంది. గత ఏడాది వేసవి కాలంలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన ధోనీ నేతృత్వంలోని టీమిండియా మొత్తం నాలుగు టెస్టుల్లోనూ ఓటమిచెంది ‘వైట్‌వాష్’తో స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం విదితమే. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మూడు టెస్టుల్లోనూ భారత జట్టు ఘోర పరాజయాలను మూటగట్టుకోవడంతో విదేశాల్లో వరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌లలో ధోనీ సేన ఓటమి చెందినట్టయింది. దీంతో భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా అత్యంత హీనమైన రెండో దశలో కొనసాగుతోంది. భారత జట్టు పరాజయాల పరంపరకు తగినన్ని పరుగులు చేయలేకపోవడమే కారణమని ధోనీ అంగీకరించాడు. 'ఇంగ్లండ్‌తో సిరీస్ నుంచి పెర్త్ టెస్ట్‌లో పరాజయం వరకు మేం తగినంత స్కోరు ప్రత్యర్థి ముందు ఉంచలేకపో యాం. ఓటమికి అదే కారణం. బ్యాట్స్‌మెన్ రాణించి భారీస్కోరు సాధిస్తే బౌలర్ల పని తేలికవుతుంది.టెస్టు ల్లో ఒకటి లేదా రెండు చెత్త ప్రదర్శనలంటే సాధారణం అనుకోవచ్చు. కానీ, విదేశాల్లో మేమాడిన ఏడు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాం. ఇంత చెత్త ప్రదర్శన నా కెరీర్‌లో ఇంతవరకూ చూడలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే బౌలింగ్ విభాగం నుంచి ఆందోళన లేదు కానీ, బ్యాట్స్‌మెన్‌లోనే నిలకడ లోపించింద'ని ధోనీ వ్యాఖ్యానించాడు. విదేశీ గడ్డపై చెత్త ప్రదర్శనకు తానే ప్రధాన కారణమంటున్నాడు టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ. కెప్టెన్‌గా ఈ పరాజయాలకు ప్రధాన దోషి ని నేనేనంటూ తనను తాను నిందించుకుంటున్నాడు. 'ఓటమికి ఏ ఒక్కరినో బా ధ్యులను చేయలేం. నాయకుడిగా ఈ పరాభవాలకు ప్రధాన దోషిని నేనే'.. ఆతి థ్య ఆస్ట్రేలియా చేతిలో వరుసగా మూడో టెస్టులోనూ ఘోర పరాజయం చవిచూసిన అనంతరం ధోనీ చేసిన వ్యాఖ్యలివి.మిస్టర్ కూల్ కెప్టెన్‌గా, వ్యూహ చతురతలో దిట్టగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న మహీ తాజా ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయా డు. అయినప్పటికీ ఇంగ్లండ్ సిరీస్ నుంచి వరుసగా విఫలమవుతున్న సీనియర్లను వెనకేసుకొస్తున్నాడు. ఇక సీనియర్లను సాగనంపుతా రా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. 'సీనియర్లను తొలగించాలనేది చాలా కీలకమైన నిర్ణ యం. వారి అనుభవం యువకులకు అవస రం. అయితే సీనియర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేద'ని అన్నాడు.

No comments:

Post a Comment