Sunday, 20 November 2011

అత్యవసర రోగుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీ న్ సిగ్నల్

కర్నూలు సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర రోగుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీ న్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బయట నుంచి వచ్చే మెడికల్ ఆక్సిజన్ లో కల్తీ వస్తున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ఇటీవల పెద్దాసుపత్రిలోని చిన్న పిల్లల విభాగంలో ఆక్సిజన్ అందక చి న్నారులు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్‌లో ని గాంధీ, నిజామ్ ఆసుపత్రి తరహా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది. ఇందుకోసం రూ. 60 లక్షలతో బ్రిటీష్ ఆక్సిజన్ కంపెనీతో ప్రభుత్వం 15 ఏళ్లు ఒప్పందాన్ని చేసుకొంది. దీంతో ఆసుపత్రిలోని క్యాజువాల్టీ వెనుక భాగన ఖాళీ పార్కు స్థలం లో ఫ్లాంట్ పనులను ప్రారంభిస్తున్నా రు.ఇక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా ఆ సుపత్రిలో ఏఎంసీ క్యాజువాల్టీ, చిన్న పిల్లల వార్డు, టీబీ వార్డు, ఆపరేషన్ థి యేటర్లు, ఇతర విభాగాలకు అన్ని వేళ లో ఆక్సిజన్ అందుతుంది. ప్లాంట్‌లో ఒకేసారి 10 కేఎల్ గ్యాస్ సామర్థ్యం ఉంటుంది. ఇది 10 రోజుల వరకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. నాలు గు రోజుల ముందుగానే బ్రిటీష్ ఆక్సిజ న్ కంపెనీ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దీంతో ఆక్సిజన్ కొరత సమస్యే ఉండ దు. ఈ ప్లాంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. లక్షలు ఆదా అవుతుంది

No comments:

Post a Comment