Sunday, 20 November 2011

గ్రేటర్ రాయలసీమతోనే అభివృద్ధి:సినీ నటుడు నరేష్

 రా ష్ట్ర విభజన జరిగితే రాయలసీమ జి ల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటుచేస్తే అభివృద్ధి సాధ్యమని రాయలసీమ వికాస సమితి వ్యవస్థాపకుడు, సినీ నటుడు నరేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆదర్శసొసై టీ భవనంలో రాయలసీమ వికాససమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమనీ, ఒకవేళ విడిపో తే గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయాలన్నారు.రాయలసీమ వెనుకబడిన విషయాన్ని శ్రీకృష్ణకమిటీ సై తం స్పష్టంచేసిన విషయం గుర్తు చే శారు. రాయలసీమ జిల్లాలను విడదీసి తెలంగాణ, కోస్తాంధ్రల్లో కలపాలనే చూస్తే సహించేది లేదన్నారు. ప్ర జలలో చైతన్యం తీసుకురావడానికి త మ సమితి పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సమితి సభ్యులు రమేష్‌బాబు, లక్ష్మీనారాయ ణ, పార్వతమ్మ, చంద్రశేఖర్‌యాదవ్, రఘునాథరెడ్డి, రమేష్‌గౌడ్, రమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు

No comments:

Post a Comment