Sunday, 20 November 2011

ఘనంగా మహిళా దినోత్సవం

 స్థాని క సాయికుల్వంత్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘ నంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి మహిళలు పాల్గొన్నారు. సత్యసాయిబాబా స్ఫూర్తితో తాము సైతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ ని ఈ సందర్భంగా వారు పేర్కొన్నా రు. ఈశ్వరమ్మ వెల్ఫేర్ ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ.. సత్యసాయిబా బా ఆధ్యాత్మిక బోధనలతోపాటు పేదలకు విద్య, ఖరీదైన వైద్యం, స్వచ్ఛమై న తాగునీరు అందించారన్నారు. సత్యసాయి భౌతికంగా లేకపోయినా భక్తు ల హృదయాల్లో ఉన్నారన్నారు. సత్యసాయి చూపిన సేవామార్గాన్ని విడనాడరాదని, సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. మాతృమూ ర్తి ఈశ్వరమ్మ కోరిక మేరకే సత్యసాయి వైద్య, విద్య, తాగునీరు అందించారన్నారు. మాతృమూర్తి సేవలో తరించాలన్నారు. ఈ సందర్భంగా టీవీఎస్ మల్లికా శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనీ, సుగుణాలతో విలువలతో కూడిన జీవనం సాగించాలన్నారు. సహనం, త్యాగం, సేవానిరతికి మహిళలు ప్రతీకలుగా నిలవాలన్నారు. కాగా సత్యసాయిని స్ఫూర్తిగా తీసుకుని తమ దేశాల్లో సేవలు చేస్తున్నామని, వీటిని నిరంతరం కొనసాగిస్తామని విదేశీ మహిళలు తెలిపారు. ఆయా దే శాలలో వారు చేపట్టిన సేవాకార్యక్రమాలు వివరించారు. విద్యార్థులు మం గళవాయిద్యాలతో సత్యసాయి మహాసమాధికి పూజలు చేశారు. సమాధితోపాటు దర్శనహాలును ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం సంగీతకచేరి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు

No comments:

Post a Comment