తిరుమలలో టిటిడి ఏర్పాటు చేసిన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవన సముదాయంలో ప్రసాదం తినే భక్తులకు టోకన్ విధానాన్ని ప్రవేశపెట్టడంపై టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత భోజనానికి టోకన్లు పెట్టమని ఎవరు చెప్పారని అన్నదానం డిప్యూటీ ఇఓ గజపతిని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ టోకన్ విధానాన్ని తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు వారం రోజుల క్రితం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో గురువారం అన్నదానం భవనాన్ని తనిఖీ చేసిన చైర్మన్ టోకన్ విధానంతో భక్తులు భోజనశాలకు వెళుతున్న విషయాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా టోకన్ కౌంటర్ వద్ద భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. కానీ, లోపల భోజన హాలు మాత్రం ఖాళీగా ఉంది. దీంతో ఆగ్రహించిన బాపిరాజు ఇలాంటి ఆలోచనలు చేసి భక్తులను ఎందుకు ఇబ్బంది పెడతారంటూ ప్రశ్నించారు. అలాగే, పాదరక్షలు లేకుండా భోజనం చెయ్యాలన్న నిబంధన ఎందుకు పెట్టారు? పోనీ ఒక నిబంధన పెట్టినప్పుడు అందుకు తగిన సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు? అని కోప్పడ్డారు. అయినా బెంచిలపై కుర్చుని భోజనం చేస్తున్న భక్తులకు పాదరక్షలు వున్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. భక్తులకు సదుపాయాలను వీలైనంత తక్కువ ఇబ్బందులతో కల్పించాలని సూచించారు.
తిరుమలలో శుభ్రత, భద్రత ప్రధానం
తిరుమల పుణ్యక్షేత్రం శుభ్రంగా వుండటం, వైకుంఠం కాంప్లెక్స్లోని భక్తులకు భద్రత కల్పించడమే తన ఆశయమని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లు తనిఖీ సందర్భంగా భద్రతకు సంబంధించి ఆయన అధికారులను ప్రశ్నించారు. కాంప్లెక్స్ భద్రత ఎవరి పర్యవేక్షణలో వుంటుందని ప్రశ్నించారు. టిటిడి నిఘా అధికారుల పర్యవేక్షణలో వుంటుందని అక్కడనున్న సిఐ తెలిపారు. అలా కాకుండా పోలీసులు ఈ భద్రత పర్యవేక్షించరా? అని ప్రశ్నించారు. డిఎస్పి రెడ్యానాయక్ పర్యవేక్షణలో భద్రత చూస్తున్నామని సిఐ సమాధానమిచ్చారు. వెంటనే ఆయన రెడ్యానాయక్తో ఫోన్లో మాట్లాడుతూ మీరు తిరుపతిలో వున్నా ఎక్కడ వున్నా తిరుమల పర్యవేక్షణ చెయ్యాల్సిన బాధ్యత మీపై వుందని గుర్తుచేశారు. తాను ఎన్నో పర్యాయాలు తనిఖీకి వచ్చినా తానెప్పుడు మిమ్మల్ని తిరుమలలో చూడలేదని చురక అంటించారు. చైర్మన్ వెంట ఇఇ జగన్మోహన్రెడ్డి, డిప్యూటీ ఇఇలు హర్షవర్ధన్రెడ్డి, రవిశంకర్రెడ్డి, ఏవిఎస్ఓ యుగంధర్, అప్పారావు, డిప్యూటి క్యాటరింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
తిరుమల పుణ్యక్షేత్రం శుభ్రంగా వుండటం, వైకుంఠం కాంప్లెక్స్లోని భక్తులకు భద్రత కల్పించడమే తన ఆశయమని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లు తనిఖీ సందర్భంగా భద్రతకు సంబంధించి ఆయన అధికారులను ప్రశ్నించారు. కాంప్లెక్స్ భద్రత ఎవరి పర్యవేక్షణలో వుంటుందని ప్రశ్నించారు. టిటిడి నిఘా అధికారుల పర్యవేక్షణలో వుంటుందని అక్కడనున్న సిఐ తెలిపారు. అలా కాకుండా పోలీసులు ఈ భద్రత పర్యవేక్షించరా? అని ప్రశ్నించారు. డిఎస్పి రెడ్యానాయక్ పర్యవేక్షణలో భద్రత చూస్తున్నామని సిఐ సమాధానమిచ్చారు. వెంటనే ఆయన రెడ్యానాయక్తో ఫోన్లో మాట్లాడుతూ మీరు తిరుపతిలో వున్నా ఎక్కడ వున్నా తిరుమల పర్యవేక్షణ చెయ్యాల్సిన బాధ్యత మీపై వుందని గుర్తుచేశారు. తాను ఎన్నో పర్యాయాలు తనిఖీకి వచ్చినా తానెప్పుడు మిమ్మల్ని తిరుమలలో చూడలేదని చురక అంటించారు. చైర్మన్ వెంట ఇఇ జగన్మోహన్రెడ్డి, డిప్యూటీ ఇఇలు హర్షవర్ధన్రెడ్డి, రవిశంకర్రెడ్డి, ఏవిఎస్ఓ యుగంధర్, అప్పారావు, డిప్యూటి క్యాటరింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
I appreciate Mr.BapiRaju.
ReplyDelete