Tuesday, 15 November 2011

శ్రీరామరాజ్యం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ 2,500 డాలర్స్

నందమూరి బాలకృష్ణకు యుఎస్ లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉందని మరోసారి రుజువైంది.తాజాగా ఆయన చిత్రం శ్రీరామరాజ్యం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ 2,500 డాలర్స్ కు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది.కొల్లా అశోక్ బాబు అనే అభిమాని ఆ టిక్కెట్ ని పొంది తన అభిమానాన్ని చాటుకున్నారు.ఇక చిత్రం నవంబర్ 17న విడుదల అవుతుండగా ఈ ప్రీమియర్ షో మాత్రం నవంబర్ 16 న జరుగుతుంది.ఈ విషయాన్ని బ్లూ స్కై సినిమా వారు ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియచేసారు.సింహా తర్వాత పుంజుకున్న బాలకృష్ణ ఈ చిత్రంతో మరోసారి ఘన విజయం సాధిస్తాడని అందరూ అంచనాలు వేస్తున్నారు.బాలకృష్ణ శ్రీరాముడిగా,నయనతార సీతగా నటించిన చిత్రం 'శ్రీరామ రాజ్యం. బాపు దర్శకత్వంలో సాయి బాబా మూవీస్‌ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 17న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

No comments:

Post a Comment