ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నట్టు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) రీజనల్ చైర్మన్, జేఎన్టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డిఎన్.రెడ్డి పేర్కొన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి తిరుపతికి వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడా రు. దేశంలో ఇంజినీరింగ్ విద్యను అందించడంలో, పెద్ద సంఖ్యలో ఇంజినీర్లను తయారు చేయడంలో మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాల కన్నా ముందుందని ఆయన తెలిపారు. దేశంలో 3,500 ఇంజి నీరింగ్ కళాశాలలు ఉంటే మన రాష్ట్రంలో 717 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 13 లక్షల ఇంజి నీరింగ్ సీట్లు ఉంటే, మన రాష్ట్రంలో 3 లక్షల సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 22 వేల ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సామాన్యు లు, పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ను అందించాలన్న లక్ష్యంతో మన రాష్ట్రం లో ఇన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు.
మరి న్ని కొత్త కళాశాలల స్థాపనకు దరఖాస్తులను ఏఐసీటీఈ ఆహ్వానిస్తోందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖా స్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయి తే మనరాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాల ల్లో నాణ్యత ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. చట్టాల్లోని లొసుగు ల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం 1982 మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా పని చేస్తుందన్నారు. నవంబర్ మూడో వారంలో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ కావచ్చ ని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవే టు కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ర్యాగింగ్, సరైన బోధన, వసతులు లేని కళాశాలలపై ఎవరైనా ఏఐసీటీఈ వెబ్సైట్కు ు పంపవచ్చని ఆయన తెలిపారు
మరి న్ని కొత్త కళాశాలల స్థాపనకు దరఖాస్తులను ఏఐసీటీఈ ఆహ్వానిస్తోందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖా స్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయి తే మనరాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాల ల్లో నాణ్యత ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. చట్టాల్లోని లొసుగు ల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం 1982 మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా పని చేస్తుందన్నారు. నవంబర్ మూడో వారంలో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ కావచ్చ ని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవే టు కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ర్యాగింగ్, సరైన బోధన, వసతులు లేని కళాశాలలపై ఎవరైనా ఏఐసీటీఈ వెబ్సైట్కు ు పంపవచ్చని ఆయన తెలిపారు
No comments:
Post a Comment