Wednesday, 26 October 2011

దీపావళి సంప్రదాయ పర్వదినం

సంప్రదాయ పర్వదినం
దీపావళి సంప్రదాయ బద్ధమైన పండుగ. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది ఉదయాన్నే తలస్నానాలు చేసి, నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇళ్లలో లక్ష్మీ పూజలు చేసి సంపద, సౌభాగ్యంతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు. పిండి వంటలు, తీపి పదార్థాలతో మధ్యాహ్నం విందు భోజనం చేస్తారు. రాత్రి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు ఉల్లాసంగా.. ఉత్సాహభరితంగా టపాసులు కాలుస్తారు. జిల్లాలోని మార్వాడీ సేట్లు తమ వ్యాపారాలకు సంబంధించి కొత్తగా పద్దుల పుస్తకాలను దీపావళి నుంచే ప్రారంభిస్తారు. శుభం, లాభం కలగాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. 

విశేష పూజలు
దీపావళి సందర్భంగా దాదాపు అన్ని వైష్ణవాలయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. దేవాలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు, నామ పారాయణం, అలంకారాలు చేస్తారు. కొన్ని చోట్ల రాత్రి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం, జయనగర్ కాలనీలోని శ్రీదేవి, భూదే వి సమేత కళ్యాణ వేంకటే శ్వరస్వామి ఆలయం, నకాష్‌లోని శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి ఆలయం, గడ్డిజజారులోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయం,
విశేషాలంకారంతో పూజలు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment