Wednesday, 19 October 2011

కర్నూలు వైద్యశాలలో వైద్యుల పోరు వీధికెక్కింది

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యుల పోరు వీధికెక్కింది. ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. సోమవారం జరిగిన సంఘటన చినికిచినికి గాలివానగా మారి పెద్దాసుపత్రిలో ఆధిపత్య పోరుకు మరోసారి ఆజ్యం పోసినట్లయింది. సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుదర్శన్, ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వనాథరెడ్డి తదితరులు కలెక్టరేట్‌లో డెంగ్యూపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌పై చర్చించుకుంటున్న సమయంలో గొడవ ప్రారంభమైంది.

మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల స్క్రూటినీ చేయడానికి కొందరు వైద్యులు రావడం లేదని.. మరోసారి ఇలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ సుదర్శన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ శ్రీహరి తదితరులు సూపరింటెండెంట్ చాంబర్‌కు వచ్చి ఈ విషయమై ప్రశ్నించారు. తమకు సమాచారం తెలపకుండా స్క్రూటినీ చేయడం లేదని ఎలా చెబుతారని ప్రశ్నిం చారు. సమాచారమిచ్చామని అధికారు లు, లేదని వైద్యులు చెప్పడంతో మాటామాటా పెరిగింది. ఒక దశలో తాను ఈ సీటులో కూర్చోలేనని, రాజీనామా చేస్తానని డాక్టర్ సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. డాక్టర్ విశ్వనాథరెడ్డి వల్లే ఇదంతా జరుగుతుందన్న ధోరణిలో వైద్యులు మాట్లాడటంతో ఘర్షణ మరిం త తీవ్రమైంది

No comments:

Post a Comment