పవిత్రమైన కార్తీక మాసంలో వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక గంగాసదన్ కాన్ఫరెన్స్హాల్లో ట్రస్ట్బోర్డు చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు అన్ని విభాగాల శాఖాధిపతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాల్లో విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు వసతి, దర్శన సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. వచ్చిన భక్తులందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి వీలుగా స్వామివార్ల అలంకార (దూర)దర్శనాన్ని ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఇటీవల ప్రతి శని, ఆది, సోమవారాలలో ఏర్పాటు చేస్తున్న సామూహిక అ భిషేకాలను ఈ కార్తీకమాసం నెలరోజులు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనవాయితీ ప్రకారం కార్తీకమాసంలో ముందస్తు అభిషేకం టికెట్ ధర రూ.1500, కౌంటర్లో విక్రయించే టికెట్ ధర రూ. 1,000 గా పెంచినట్లు పేర్కొన్నారు. రద్దీ రోజుల్లోపాటు పర్వదినాలలో స్వామివార్ల దర్శనార్థమై వచ్చే ముఖ్య అతిధులు, విశిష్ట వ్యక్తులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతిరోజూ రాత్రి 7.30 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రత్యేక బ్రేక్ దర్శనం ఉంటుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమావేశంలో ఈఈ రమేష్, డీఈ నాగేశ్వరరావు, ఏఈఓలు రాజశేఖర్, సదానందం, కేశవరావు, హార్టికల్చర్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు కృష్ణారెడ్డి, హరిదాస్, నాగభూషణం, కేశవరెడ్డి, డి మల్లయ్య, మోహన్, సీఎస్ఓ కరుణానిధి, వన్టౌన్ ఎస్సై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Wednesday, 19 October 2011
ఈ నెల 27 నుంచి కార్తీకమాసం భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు
పవిత్రమైన కార్తీక మాసంలో వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక గంగాసదన్ కాన్ఫరెన్స్హాల్లో ట్రస్ట్బోర్డు చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు అన్ని విభాగాల శాఖాధిపతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాల్లో విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు వసతి, దర్శన సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. వచ్చిన భక్తులందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి వీలుగా స్వామివార్ల అలంకార (దూర)దర్శనాన్ని ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఇటీవల ప్రతి శని, ఆది, సోమవారాలలో ఏర్పాటు చేస్తున్న సామూహిక అ భిషేకాలను ఈ కార్తీకమాసం నెలరోజులు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనవాయితీ ప్రకారం కార్తీకమాసంలో ముందస్తు అభిషేకం టికెట్ ధర రూ.1500, కౌంటర్లో విక్రయించే టికెట్ ధర రూ. 1,000 గా పెంచినట్లు పేర్కొన్నారు. రద్దీ రోజుల్లోపాటు పర్వదినాలలో స్వామివార్ల దర్శనార్థమై వచ్చే ముఖ్య అతిధులు, విశిష్ట వ్యక్తులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతిరోజూ రాత్రి 7.30 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రత్యేక బ్రేక్ దర్శనం ఉంటుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమావేశంలో ఈఈ రమేష్, డీఈ నాగేశ్వరరావు, ఏఈఓలు రాజశేఖర్, సదానందం, కేశవరావు, హార్టికల్చర్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు కృష్ణారెడ్డి, హరిదాస్, నాగభూషణం, కేశవరెడ్డి, డి మల్లయ్య, మోహన్, సీఎస్ఓ కరుణానిధి, వన్టౌన్ ఎస్సై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment