Friday, 10 February 2012

జర్నలిస్టు పాత్రలో...పవన్ కళ్యాణ్

గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశాడు దర్శకుడు. తాజాగా శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ ఖారారు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.


No comments:

Post a Comment