Sunday, 12 February 2012

చంద్రబాబుకు యువత గురించి మాట్లాడే అర్హత లేదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

యువ నాయకత్వం గూర్చి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు  విమర్శించారు. తిరుపతిలో బైక్ నడిపినంత మాత్రాన యువకుడైపోతాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 శాతం మద్యం షాపులు టీడీపీ నాయకులవేనని స్పష్టం చేశారు. కడప వైఎస్ఆర్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. .ఈ సందర్భంగా  మాట్లాడుతూ చంద్రబాబు నోట యువతరం, యువనాయకత్వం అనే మాటలు రావడం హాస్యాస్పదంగా వుందన్నారు. టీడీపీలో వారసత్వం లేదని ప్రకటించిన చంద్రబాబుకు యువతతో ఏమి పని అని ప్రశ్నించారు. యువత గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వుందని చెప్పారు. వై అన్న పదంలోనే యువత వుందని స్పష్టం చేశారు.తమ నాయకులకు 38 సంవత్సరాల వయసులోనే పార్టీకి సారధిగా వున్నారని తెలిపారు. టీడీపీలో 33 శాతం యువతకు అర్హత కల్పిస్తామని 1990 నుంచి బాబు చెబుతునే వున్నారన్నారు. ప్రతి సమావేశంలో బాబు తనను నమ్మండి నమ్మండి అని చెబుతుంటారు అంటే ఆయనను ప్రజలు నమ్మడం లేదని ఆయనకు స్పష్టమైనట్లు వుందని విమర్శించారు. ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు ప్రజలు నమ్మె స్థితిలో లేరని చెప్పారు. ఎన్‌టిఆర్ కిలో రూ.2 బియ్యం పథకాన్ని పెడితే బాబు అధికారంలోకి రాగానే అదిఎత్తేశారన్నారు. అలాగడే మద్యం నిషేదం కూడా అని చెప్పారు. ప్రస్తుతం మద్యం సిండికేట్లపై మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 50శాతం మద్యం షాపులు టిడిపి నాయకులవేనని చెప్పారు. కుప్పంలో 16వుంటే అన్నీ టిడిపి వారివే అని తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మే స్థాయిలో యువత లేదని చెప్పారు.

No comments:

Post a Comment