Sunday, 12 February 2012

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఉక్కుపాదం

జిల్లాలో ఫ్యాక్షన్‌ను నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా ఎస్పీ షహనవాజ్‌ఖాసీం పోలీసు అధికారులకు పిలుపు నిచ్చారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధానంగా ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి,ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు కాన్ఫరెన్స్‌హాల్‌లో డీఎస్పీలు,సీఐలు,ఎస్ఐలతో ఎస్పీ సమీక్షించారు.ఫ్యాక్షన్ గ్రామాల్లో తాజా పరిస్థితులు,తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఫ్యాక్షన్ నాయకులు,వారి అనుచరుల కదలికలపై గ్రామాల వారీగా పోలీసుల అధికారులతో ఆరాతీశారు. ఆ గ్రామాల్లో పరిస్థితి, ఇరువర్గాలు ప్రశాంతంగా జీవిస్తున్నారా..?లేదా వైరివర్గాలు ఒకరినొకర అంతమొందించే వ్యూహాలకు పూనుకుంటున్నారా..? దాడులకు దిగే అవకాశం ఉందా..? వారి ఆర్థిక పరిస్థితి, ప్రవర్తన తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు ఫ్యాక్షన్ తీవ్రతను బట్టి క్రమం తప్పకుండా పల్లె నిద్రలు చేయాలన్నారు. మొక్కుబడిగా పల్లె నిద్రలు చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. వీటితోపాటు పలు కేసులపై ఆయన చర్చించారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ముఖ్యపట్టణాల్లో రౌడీయిజం, దందాలను తీవ్రంగా పరిగణించాలన్నారు

No comments:

Post a Comment