Thursday, 2 February 2012

అనంతపురం జిల్లాలో వజ్రాలపై అంతర్జాతీయ సదస్సు

స్థానిక జియలాజికల్ సర్వే ఆఫ్‌ఇండియా(జీఎస్‌ఐ) వజ్రాల పరిశోధన కేంద్రంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు వజ్ర పరిశోధనలపై అంతర్జాతీయ సదస్సు జర గనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశీ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు.వారి కోసం వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. వజ్రాలు ఎలా లభిస్తాయి? వజ్రాల ముడి ఖనిజమైన కింబర్‌లైట్ ఎలా ఉంటుంది ? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? నాణ్యతను గుర్తించడం ఎలా ? వ్యాపారపరంగా సాధ్యమా.. కాదా? తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముడిఖనిజాన్ని ప్లాంట్‌కు తరలించిన తరువాత వజ్రాలు ఎలా వెలికితీస్తారు? అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను జూనియర్ జియాలజిస్టులకు సీనియర్ శాస్తవేత్తలు వివరించే అవకాశముంది.

No comments:

Post a Comment