Saturday, 14 January 2012

కుటుంబ సభ్యులను కూడా నమ్మరు...మంత్రి శైలజానాథ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను కూడా నమ్మరని రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వారసులు నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కోసం వాడుకుంటున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బ్లాక్ మెయిల్ చేసే నైజం చంద్రబాబుదేనని, తమ కాంగ్రెసు పార్టీకి ఆ నైజం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకే ప్రజారాజ్యం పార్టీ నాయకులకు మంత్రి పదవులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సోనియా గాంధీ ఆశీస్సులతో అధిష్టానం పరిశీలన జరిపి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపి నియామకాలు, పదవులు ఇస్తారని ఆయన వివరించారు.

No comments:

Post a Comment