Saturday, 28 January 2012

లక్ష ఎకరాల్లో అన్నదాతకు ఉపాధి

జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసా యం. అత్యధిక మండలాల్లో పంటలు వర్షంపై ఆధారపడి ఉన్నాయి. వరుణు డు కరుణించకపోతే అన్నదాత కరువు కాటుకు గురవుతాడు. పడమట మండలాల రైతులు ప్రతి యేటా కరువు బారి న పడుతూనే ఉంటారు. కరువు బారి నుండి అన్నదాతను రక్షించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద తోటలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. మొదట్లో కానుగ, అల్లనేరేడు, జెట్రోఫీ మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ జెట్రోఫీ మొక్కలు పెంచడానికి చాలా మంది సుముఖత చూపలేదు. మామిడి మొక్కల పెంపకం కోసం చాలా మంది రైతుల నుండి వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మామిడి మొక్కల పెంపకానికి ఉపాధి అధికారులు అనుమతించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధిహామీ పథకంలో తోటల పెంపకానికి పెద్ద పీట వేస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు సుమారు లక్ష ఎకరాల్లో మొక్కల పెంపకం చేపట్టారు. ఎకరాకు సగటున రూ.62 వేలు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.650కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో తోటల పెంపకానికి మం చి స్పందన ఉంది. మరికొన్ని మండలాల్లో ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవడంలేదు. సద్వినియో గం చేసుకునే అన్నదాతకు ఉపాధి ఓ వరంగా మారింది.జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఉపాధిహామీ పథకం కింద మొక్కల పెంపకం చేస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 969 గ్రామ పంచాయతీల్లో 22,721 మంది రైతులకు చెందిన 32,315.65 ఎకరాల్లో తోటల పెంపకం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా ఎం చుకున్నారు. ఈ ఏడాది ఇంతవరకు 6,911మంది రైతులకు చెందిన 12,674.01 ఎకరాలలో మొక్కల నాటే కార్యక్రమం జరగుతోంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1587.03 లక్షలు ఖర్చుచేశారు. మామిడితోటల పెంపకానికి ఎకరాకు మూడేళ్ళకు రూ.62వేల వంతున నిధు లు విడుదల చేస్తారు. డ్రిప్ ఇరిగేషన్‌కు అయితే అదనంగా మరో రూ.30 నుం డి రూ.40వేలు ఇస్తారు. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటున 70 మొక్కలు పెంచవ చ్చు. మొక్కనాటడానికి గుంత (పిట్స్) లు తీయడం మొదటుకుని నాటడం, నీరు పోయడం, కంచె వేయ డం, ఎరువులు అన్నింటికీ ఉపాధిహా మీ పథకం కింద నిధులు ఇస్తున్నారు. ముఖ్యంగా పేద రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. కొన్ని మండలాల్లో రైతులకు అవగాహన కల్పించక పోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మండలాలు మరీ అధ్వానం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పేద రైతుల వద్దకు తీసుకెళ్ళడంలో ఉపాధి సిబ్బంది విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మండలాల్లో రైతులు ఈ తోటల పెంపకానికి దూరంగా ఉంటున్నారు. జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది

No comments:

Post a Comment