నిరుద్యోగ యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా
పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జవహర్బాబు పేర్కొన్నారు. మండల
పరిధిలోని శ్రీరామానుజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ)
కళాశాలలో ‘ఎంటర్ ప్రీమియర్షిప్ డెవలప్మెంట్’ అనే అంశంపై సెమినార్
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ ఏడీ జవహర్బాబు హాజరై
మాట్లాడారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వెంటబడి వెతుక్కోవడం కంటే
చిన్నపాటి పరిశ్రమలు స్థాపించుకొని తోటి నిరుద్యోగ యువతకు ఉపాధి
అందించాలన్నారు.
ఎంఎస్ఎంఐడీ యాక్ట్ గురించి వాటి నియమ నిబంధనల గురించి వివరించారు. యువత పరిశ్రమల కోసం ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో, కావాల్సిన లెసైన్స్, పెట్టుబడులు సమకూర్చుకోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు, బ్యాంకుల రుణ సదుపాయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు స్థాపించడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఐడీ యాక్ట్ గురించి వాటి నియమ నిబంధనల గురించి వివరించారు. యువత పరిశ్రమల కోసం ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో, కావాల్సిన లెసైన్స్, పెట్టుబడులు సమకూర్చుకోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు, బ్యాంకుల రుణ సదుపాయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు స్థాపించడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment