Sunday, 4 December 2011

5 నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు

  రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలైకి వెళ్లే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే నడపనున్న 132 ప్రత్యేక రైళ్లకు సోమవారం (5వతేదీ) నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. రైళ్ల వివరాలివి...
కొల్లాం-తిరుపతి (07506) కాట్పాడి, చిత్తూరు స్టేషన్‌ల మీదుగా డిసెంబర్ 9, 16, 23, 30 తేదీలలో 4 సర్వీసులు. ఉదయం 4గంటలకు కొల్లాంలో బయలుదేరి రాత్రి 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.18 బోగీలు ఉంటాయి.
తిరుపతి-అకోలా (07406) డిసెంబర్ 17వ తేదీన ఒక సర్వీసు గూడూరు, విజయవాడ, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్‌ల మీదుగా నడుస్తుంది.ఉదయం 9గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు 9.30 గంటలకు అకోలా చేరుకుంటుంది. 18 బోగీలు ఉంటాయి.
తిరుపతి-ఔరంగాబాద్ (07405) గూడూరు, విజయవాడ, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్‌ల మీదుగా డిసెంబర్ 10, 24 తేదీలలో 2 సర్వీసులు నడుస్తాయి.ఉదయం 9 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. 18 బోగీలు ఉంటాయి.
తిరుపతి-ఆదిలాబాద్ (07407). గూడూరు, విజ యవాడ, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్‌ల మీదుగా డిసెంబర్ 31న ఒక సర్వీసు. ఉదయం 9గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది. మొత్తం 18 బోగీలు ఉంటాయి.

No comments:

Post a Comment