Thursday, 1 December 2011

సమ్మె విరమించిన త్రిపుల్ ఐటీ ఉద్యోగులు


కడపజిల్లా ఇడుపాయల ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నలభై ఐదు రోజుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిప్యూటీ సీఎం రాజనర్సింహ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు.ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింపజేశారు. దీంతో ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని త్రిపుల్ ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు.

No comments:

Post a Comment