గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), సహాయకుల (వీఆర్ఏ) పోస్టుల భర్తీకి రాత
పరీక్ష నిర్వహించే బాధ్యతను జేఏఎన్టీయూకు అప్పగించినట్లు భూ పరిపాలన
ప్రధాన కమిషనర్ జె.సత్యనారాయణ తెలిపారు. ఎంసెట్ తరహాలోనే రెవెన్యూ
పోస్టులకు రాతపరీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.ఓఎంఆర్షీట్
ఆధారంగా పరీక్ష ఉంటుందని చెప్పారు. శుక్రవారం తన కార్యాలయంలో మరో సీనియర్
అధికారి ఎల్లప్పతో కలిసి సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఈ నెల 7న జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ
అయ్యాయి. ఈ నోటిఫికేషన్లోని పేర్కొన్న పలు ముఖ్యాంశాలకు ఆయన వివరణలు
ఇచ్చారు. వీఆర్ఓ పోస్టుకు ఇంటర్బోర్డు సర్టిఫికెట్ తప్పనిసరి అని
చెప్పారు. డిప్లొమాలు, దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ పోస్టుకు
అనర్హులని స్పష్టం చేశారు.రెవెన్యూ పోస్టుల భర్తీలో బీసీ
క్రీమీలేయర్ను పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ,
హాల్టికెట్ల జారీ పూర్తిగా ఆన్లైన్ (ఛిఛిజ్చూ.ఛిజజ.జౌఠి.జీn) ద్వారానే
జరుగుతుందన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 29 గడువు ముగుస్తున్నా..
అంతకంటే ముందుగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సత్యనారాయణ సూచించారు.
"29వ తేదీ వరకు గడువు ఉంది కదాని అందరూ అదే రోజు దరఖాస్తు చేస్తే.. లోడ్
ఎక్కువై సైట్ స్తంభించే ప్రమాదం ఉంది. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవడం
మంచిది'' అని ఆయన సూచించారు.దరఖాస్తుల సమయంలో ఆన్లైన్లో కుల
«ద్రువీకరణ పత్రాల పరిశీలన ఉండదని చెప్పారు. రాతపరీక్ష అనంతరం అభ్యర్థులను
ఎంపికచేశాక కుల «ద్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఎవరైనా తప్పుడు
కుల «ద్రువీకరణలతో పరీక్షలు రాసినట్లు తేలితే చట్టపరంగా కఠినచర్యలు
తీసుకుంటామని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment