ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా కొత్తగా తిరుపతి-అమరావతి-తిరుపతి
బైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే
అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ రైలును
ప్రవేశపెట్టనున్నారు. కాగా శనివారం అమరావతిలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ
ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో
కే.సాంబశివరావు తెలిపారు. తిరుపతి-అమరావతి సూపర్ఫాస్ట్
ఎక్స్ప్రెస్(నంబర్ 12765) తిరుపతి నుంచి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 3.10
గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు అమరావతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో అమరావతి-తిరుపతి ఎక్స్ప్రెస్(నంబర్ 12766) అమరావతి
నుంచి సోమ, గురువారాల్లో ఉదయం 6.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం
6.40గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
No comments:
Post a Comment