Friday, 28 October 2011

తిరుపతిలో వరలక్ష్మి నోములను మహిళలు ప్రత్యేక పూజలు చేపట్టారు

తిరుపతిలో వరలక్ష్మి నోములను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు దేవాలయాల్లో ముత్తయిదువలు ప్రత్యేక పూజలు చేపట్టారు. దీంతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. పూలు, పండ్లు పూజకు ప్రధానం కావడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక అరిసెలు సమర్పించడం ఇక్కడి పూజలో ప్రత్యేకం. దీంతో ఇక్కడి అరిసెలు తయారు చేసే వారు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దీపావళి సందర్భంగా ముత్తయిదవలు మంగళగౌరీ వ్రతం నిర్వహించడం పరిపాటి. తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ వారు ఈ వ్రతాన్ని చేపట్టారు. పూజానంతరం నోము దారాలను కట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. .

తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.గౌరీ నోముల్లో పూలు, పండ్లతో పాటు అరిసెలు సమర్పించడం తప్పనిసరిగా భావిస్తారు. అరిసెల తయారీ శ్రమ, ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇప్పుడు తిరుపతిలో కొన్ని కుటుంబాలు ప్రత్యేకంగా అరిసెల తయారీని చేపట్టారు. దీంతో ఇళ్లల్లో అరిసెల తయారీ బాధ తప్పింది. విజయవాడకు చెందిన కొన్ని కుటుంబాల వారు ఇప్పుడు అరిసెల తయారీ చేపట్టి తిరుపతిలో అమ్ముతున్నారు. అంగళ్లు ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఉపాధి లభిస్తోంది

No comments:

Post a Comment