Friday, 28 October 2011

గంభీర్‌ పెళ్లికొడుకు అవతారంలో అభిమానులను అలరించనున్నాడు

ఇన్ని రోజులు టీమిండియా  మైదానంలో ఆటతో అభిమానులను అలరిస్తే ఈరోజు మాత్రం గుర్గావ్‌లో పెళ్లికొడుకు అవతారంలో అభిమానులను అలరించనున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటాషా జైన్‌తో గంభీర్‌ గుర్గావ్‌ ఫామ్‌ హౌస్‌లో పెళ్లి చేసుకొనున్నాడు. ఈ ప్రయివేట్‌ కార్యక్రమానికి గంభీర్‌ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ వివాహానికి ప్రముఖ సింగర్‌ రహత్‌ ఫతేష్‌ ఖాన్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయనున్నాడు. 
Natasha Jain-Gautam Gambhir
, నటాషా జైన్‌లకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్‌-ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో వాయిదా పడింది. కొత్త దంపతులకు వెడ్డింగ్‌ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్‌ శాంతాను నిఖిల్‌ రూపొందించారు. శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టి20 మ్యాచ్‌కు గంభీర్‌ అందుబాటులో ఉండడు. ఇక గంభీర్ పెళ్లికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మొదలగున వారు హాజరవనున్నట్లు తెలిసింది

No comments:

Post a Comment