Thursday, 20 October 2011

రాయలసీమ పరిధిలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

                                     
రాయలసీమ పరిధిలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాడు కదిరి, లేపాక్షి, హిందూపురం ప్రాంతాల్లో ఎస్‌ఇతోపాటు ఇఇ శ్రీనివాసరావు, డిఇ గంగయ్యలు వివిధ దేవాలయాలను పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక గుడ్డం రంగనాథస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన పాత్రికేయులతో ఎస్‌ఇ మాట్లాడారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చరిత్రను దృష్టిలో వుంచుకొని మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దేవాలయ పరిధిలో రూ.40 లక్షలతో భక్తుల సౌకర్యార్థం సామూహిక సత్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు లోగా పనులు పూర్తి అవుతాయని తెలిపారు. అదే విధంగా రూ.1.50 కోట్లతో అధునాతన 40 గదుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇకపోతే కదిరి గాంధీచౌక్ సమీపంలో రూ.18 లక్షలతో దేవాలయానికి సంబంధించిన స్థలంలో 16 వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నట్లు ఎస్‌ఇ తెలిపారు. దీనికి తోడు కదిరి సమీపంలోని కొండల నరసింహస్వామి దేవాలయంలో ఎంతోకాలంగా వివాహాలు అధికంగా సాధారణ ప్రజలు నిర్వహిస్తున్నందున మరింత అభివృద్ధి చేసే విధంగా రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాలును అధునికంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు

No comments:

Post a Comment