Saturday, 22 October 2011

కడప: విభజిస్తే అగ్నిగుండమే

భావితరాల వారికి అన్యాయం జరగకుండా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి అన్నారు. కడపలో జరుగుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములులాగా దీక్ష చేసినవారు తెలంగాణలో ఎవరూ లేరని ఆయన అన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.




No comments:

Post a Comment