Saturday, 22 October 2011

అటవీ ప్రాంతాల్లో 25 చిరుతలు

                   
రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని శేషాచలం, వెలుగొండ అటవీ ప్రాంతాల్లో సుమారు 25 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని రాజంపేట డివిజనల్ ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయంలో అటవీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ... గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా 25 చిరుతలు ఉన్నట్లు తాము నిర్ధరణకు వచ్చామన్నారు. శేషాచలం అటవీ ప్రాంతానికి తరచుగా 20 ఏనుగుల మంద వచ్చి వెళ్తుంటుందన్నారు. ఈ ప్రాణులు అటవీ ప్రాంతాన్ని దాటి శివారుల్లోకి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు

No comments:

Post a Comment