Sunday, 30 October 2011

అనంతపురం జిల్లా లో 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించారు

జిల్లాలోని 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రభుత్వం శనివారం అధికారిక ంగా ప్రకటించింది. మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశానంతరం ఈ విషయాన్ని మంత్రి డీకే అరుణ అధికారికంగా విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అ యితే కరువు మండలాలుగా ప్రకటించడంతోటే సరిపెడతారా...? లేక కరువు మ్యాన్యువల్‌ను అమలు చేస్తారా..? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కరువు ప్రాంతంగా జిల్లా పేరుగాంచింది. అతివృష్టి...అనావృష్టితో కొన్ని సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు                                                    

గత ఏడాది ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో మొదట 57 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. రైతులు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో... ఆ తర్వాత మిగిలిన ఆరు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించా రు. జిల్లాలో గత నాలుగేళ్లుగా వరుసగా కరువు కరాళనత్యం చే స్తూనే ఉంది. గత ఏడాది జిల్లాలోని మండలాలన్నింటినీ కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ... ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది కేవలం రూ.84 కోట్ల వడ్డీ మాఫీని ప్రకటించారు. అయితే నేటికీ కేవలం 50 శాతం వడ్డీమాఫీ మాత్రమే అమలయింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పంటనష్ట పరిహారానికే దిక్కులేదు ..? గత ఏడాది 8,14,077 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు... పంట కోత సమయంలో జల్ తుపాను ప్రభావంతో పూర్తిగా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 202 రెవెన్యూగ్రామాల పరిధిలో 2.53లక్షల హెక్టార్ల సాగులో 1,05,648 మంది రైతులకు రూ.127.93 కోట్ల పంటల బీమాను అందించారు. ఇందులో 50వేల మందికిపైగా రైతులకు ప్రీమియం కంటే తక్కువగానే పరిహారం అందింది. మిగిలిన 758 రెవెన్యూ గ్రామాల్లో 5.61 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసిన 5.02 లక్షల మంది రైతులకు బీమా అందలేదు. పంట నష్టపోయిన రైతులకు రూ.255 కోట్లకుపైగా పంటనష్ట పరిహారం మంజూరు చేస్తామని జిల్లాకు చెందిన మంత్రులు ,ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. ఆ దిశగా పంట నష్ట పరిహారం అందించడంలో విఫలమయ్యారు

No comments:

Post a Comment