Monday, 31 October 2011

కర్నూలు జిల్లా లో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం కూలిపోయింది

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం సోమవారం కూలిపోయింది. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేసేందుకు మౌలాలి అనే కార్మికుడు ఆలయం పైకి ఎక్కగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు

No comments:

Post a Comment