Monday, 31 October 2011

తిరుపతి రైల్వే స్టేషన్‌లో పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు

రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నుంచి ఏసీ క్లాస్ టిక్కెట్లు కొన్నవారందరూ రూ. పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. దీన్ని ప్రయోగాత్మకంగా తిరుపతిలో ప్రారంభించారు. ఇది సఫలమైతే ఈ విశ్రాంతి గదుల నిర్వహణను ప్రైవేటుపరం చేసే అవకాశముంది. ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఏసీ, స్లీపర్ సాధారణ క్లాస్‌లలో ప్రయాణించే వారే రైలు వచ్చే వరకు ఏసీ గదుల్లో ఉచితంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇక స్లీపర్ క్లాస్ ప్రయాణికులు స్లీపర్ క్లాస్ విశ్రాంతి గదుల్లో ఉండొచ్చు. వీరు తమ టిక్కెట్లను గదుల రికార్డులో నమోదు చేసి ఉచితంగా విశ్రాంతి తీసుకుంటారు. ఇకపై రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కరు రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై ప్రచారం లేకపోవడంతో పెద్ద సమస్యగా లేదు. ఒకవేళ అందరూ రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవాలంటే తిరుపతిలో సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎందుకంటే స్టేషన్‌లో ఉండేవి రెండు ఏసీ విశ్రాంతి గదులే. అందులో 80 సీట్లు ఉన్నాయి. తిరుపతి నుంచి వెళ్లే ఏసీ క్లాస్ ప్రయాణికులకే ఇవి చాలవు. అలాంటిది అందరూ విశ్రాంతి కోసం వస్తే ఎలా సాధ్యమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు

No comments:

Post a Comment