గ్రూప్ - 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ బుధవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. అధికారులు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
4.5 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ -2 పరీక్షలకు హాజరుకానున్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ జేఏసీ నేతల అభ్యర్ధనను ప్రభుత్వం తోసిపుచ్చింది. భారీ బందోబస్సు మధ్య ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది
No comments:
Post a Comment