Thursday, 1 March 2012

రెండోసారి కీమోథెరపీ చేయించుకున్న ...యువరాజ్‌సింగ్

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న క్రికెటర్ యువరాజ్‌సింగ్ రెండోసారి కిమోథెరపీ చేయించుకున్నారు. అమెరికాలోని బోస్టన్‌తో చికిత్స పొందుతున్న యూవీ మెల్లమెల్లగా క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నాడు. తాను రెండో సారి కీమోథెరిపి చేయించుకున్నట్లు యువరాజ్‌ ట్విటర్‌లో తెలిపాడు. చికిత్సలో భాగంగా మళ్లీ స్కానింగ్‌ ఈనెల ఏడో తేదీన ఉన్నట్లు యువీ ట్విటర్‌లో చెప్పారు.ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువీ ట్యూమర్‌ తగ్గుతోందన్నాడు. గత నెల రోజుల నుంచి బోస్టన్‌లోనే ఉంటున్న యువరాజ్‌ మే మొదటి వారంలో మళ్లీ బ్యాట్‌ పట్టే అవకాశాలున్నాయి. జనవరిలో చికిత్సలో భాగంగా యువీ గుండు చేయించుకున్నాడు. ఈనెల మొత్తం యువీ చికిత్స తీసుకోనున్నాడు. వచ్చే నెల నుంచి రిహాబిలిటేషన్‌ మొదలవుతుంది.

No comments:

Post a Comment