Thursday, 1 March 2012

నేటి నుంచి అనంతపురం జిల్లాలో చెరువు పోరు బాట

'నీరు లేనిదే మనిషికి మనుగడ లే దు... నీటి వనరులున్న చోట నాగరికత ఉంటుంది. జిల్లాలో సాగునీటి సౌకర్యాలు పెద్దగా అందుబాటులో లేనందున చెరువులను అభివృద్ధి చేయడం ద్వారానే కరువు కోరల నుంచి రైతన్నలకు విముక్తి లభిస్తుంది. అందుకే 'చెరువు బాట' ప్రతి ఒక్కరికీ బతుకు బాట కావాలనే ఆకాంక్షతో ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నామ'ని రాయలసీమ వికాస సాధన సమితి అధ్యక్షుడు, సీనీనటుడు నరేష్ పేర్కొన్నారు. జిల్లాలో గురువారం నుంచి 'చెరువుబాట' పేరుతో ఆయన రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భా న్ని పురస్కరించుకుని  మార్చి 1 న అనంతపురంలో రథయాత్రను ప్రారంభించి ఆరు రోజుల్లో 36 మండలాల మీదుగా 800 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ప్రజలను చైతన్య పరచనున్న ట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, కళాకారు లను భా గస్వాములను చేయనున్నట్లు తెలిపారు. యాత్ర ద్వారా ప్రతి చెరువు చరిత్రా తెలు సుకోవాలని ఆశిస్తున్నామన్నారు. యాత్రకు జాతీయ స్థా యిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మెగసెసే అవార్డు గ్రహీ త, వాటర్‌మన్ ఆఫ్ ఇండియాగా పే రొందిన రాజస్థాన్ కు చెందిన రాజేంద్రసింగ్‌ను ఆహ్వానించామన్నారు. ఇక్కడి చెరువుల అభివృద్ధి కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామన్నారు.చెరువుల అభివృద్ధి కోసమే రాయలసీమ వికాస సాధన సమితి దేశంలోనే కరువు జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురం నుంచి ప్రా రంభించి రాయలసీమ వ్యాప్తంగా ఉండే చెరువులను అభివృద్ధి పరిచేందుకు అంచెలంచెలుగా పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ వికాస సాధన సమితి ఏర్పాటు చేసినట్లు నరేష్ వెల్లడించారు.
 
 


 



 
   

No comments:

Post a Comment