శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు
మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మార్ పాపం చంద్రబాబుదేనని సీఎం కిరణ్
చేసిన వ్యాఖ్యలతో సభలో కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి తనను బ్లాక్ మెయిల్
చేస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు
సీఎం ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. కిరణ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూనే
వాస్తవాలు వినేందుకు టీడీపీ సభ్యులు సిద్ధంగా లేరని అన్నారు. గుమ్మడికాయ
దొంగ అంటే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో
టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్ద
నిల్చుని నినాదాలు చేశారు. స్పీకర్ కోరినప్పటికీ అక్కడి నుంచి కదలలేదు.
దీంతో సభ కొన్ని నిమిషాల పాటు స్తంభించింది. నన్ను జైలుకు పంపించాలని కాంగ్రెస్ నాయకులు ఎప్పటినుంచో విఫల యత్నం
చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు
ఆరోపించారు. నన్ను జైలుకు పంపించడం ఎవరి తరమూ కాదని కూడా ఆయన
హెచ్చరించారు.రాష్ట్ర శాసన సభలో గురువారంనాడు జరిగిన చర్చలో తమపై వచ్చిన ఆరోపణలకు
సమాధానం చెబుతూ తాము చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కుళ్లుకుంటోందని ఆయన
అన్నారు. రాష్ట్రానికి కన్వెన్షన్ సెంటర్లు తీసుకువచ్చిన ఘనత తమదేనని
వివరిస్తూ, గచ్చిబౌలి స్టేడియంను తాము తీసుకువస్తే, కాంగ్రెస్ నాయకులు ఈ
ప్రతిష్ఠాత్మకమైన స్టేడియంను సమావేశాలకు వాడుకుంటూ ఆ స్టేడియంను నాశనం
చేసేశారని ఆయన వివరించారు. వీటిని హైదరాబాద్కు తీసుకువచ్చిన ఘనత మాకే
చెందుతుందని చంద్రబాబు నాయుడు వివరిస్తున్నప్పుడు అధికార పక్ష సభ్యులు గొడవ
సృష్టించారు.

No comments:
Post a Comment