ముస్లింలు మక్కా మసీదుకు ఎలా వెళతారో.. ఆ విధంగా తిరుమల స్వామివారిని కూడా
ఏడాదికోసారి మాత్రమే దర్శించుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్
సూచించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో
మాట్లాడారు.తాను మొదటిసారిగా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల
వచ్చానన్నారు. తాను క్యూలైన్లో వెళ్లేటప్పుడు చాలామంది భక్తులు పలుసార్లు
వచ్చామని చెప్పారన్నారు. అందుకని భక్తులు తమ జీవితంలో ఒకసారి మాత్రమే
వైకుంఠ ఏకాదశికి రోజున స్వామివారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి
చేశారు. ఇక భక్తులు త్వరితగతిన ఆలయం వెలుపలకు వచ్చేలా గర్భగుడి
తప్ప మిగిలిన ప్రాంతాల్లోని క్యూలైన్లను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో
ఏర్పాటు చేయాలన్నారు. మఠ, పీఠాధిపతుల సలహాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తెలా
ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన క్యూలైను
ప్రవేశపెట్టాలని టీటీడీ అధికారులను మంత్రి కోరారు.
No comments:
Post a Comment