Tuesday, 24 January 2012

పరిటాల రవీంద్ర వర్థంతి ఘనంగా

మాజీ మంత్రి, తెదేపా నేత పరిటాల రవి ఏడో వర్థంతి కార్యక్రమం కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలమధ్య మంగళవారం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాలఘాట్‌ వద్ద రవి భార్య సునీత, కుటుంబసభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. రవి వర్థంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిటాల ఘాట్ అలంకరణకు థాయ్ లాండ్, ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా పుష్పాలు తెప్పించారు. ఇక బెంగుళూరుకు చెందిన కళాకారులు ఘాట్ ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవారం పరిటాల రవీంద్ర ఏడవవర్ధంతి మండలంలోని వెంకటాపురంలో  ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర ఘాట్‌ని ప్రత్యేకంగా అలంకరించారు. పరిటాల రవీంద్రమెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదానశిబిరం నిర్వహణ బాధ్యతలను పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ చేపట్టారు. ప్రధానంగా రక్తదాన శిబిరంలో 130పడకలు ఏర్పాటు చేశారు.రక్తదానశిబిరం ద్వారా పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితర దాతలు ఇచ్చే రక్తాన్ని సేకరించడానికి అనంతపురం ప్రభుత్వవైద్యశాల సిబ్బంది, రెడ్‌క్రాస్‌సొసైటీ, ఆర్‌డీటీ, ఎన్టీఆర్ ట్రస్ట్, తలసీమియా సొసైటీకి చెందిన వైద్య బృందం మంగళవారం ఉదయాన్నే వెంకటాపురం చేరుకోనుంది.  ఉదయం తొమ్మిది గంటలకు రక్తదానశిబిరాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా ప్రజల గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన పరిటాల రవి తనయుడు శ్రీరామ్ ఆధ్వర్యంలో మొదటిసారి కార్యక్రమం జరుగుతుండడంతో పలువురు అభిమానులు ఉత్సాహంగా ఆయనకు మద్ధతుగా నిలిచి తమ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. అంతే కాకుండా పరిటాల శ్రీరామ్‌తో పరిచయం కోసం తహతహలాడుతున్నారు.

No comments:

Post a Comment