Saturday, 21 January 2012

తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు


ఈనెల 30న తిరుమలలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజున భక్తులందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యాన్న ప్రసాదం అందజేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూరగాయలు అందించడానికి దాతలు ముందుకొచ్చారు. నిత్యాన్న ప్రసాద సముదాయంతో పాటు తిరుమలలోని యాత్రిక వసతి సముదాయాల్లోనూ భక్తులకు అన్నప్రసాదాలు పంచి పెట్టాలని నిర్ణయించారు. తిరు వీధుల్లో ఉదయం నుంచి రాత్రి వాహన సేవ ముగిసేంత వరకు తాగునీరు, మజ్జిగ తదితరాలను అందించనున్నారు.సూర్యజయంతిగా పిలిచే రథసప్తమి రోజున స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. దీనికోసం ఆ వాహనాలను టీటీడీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు ఆలయానికి అనుసంధానంగా ఉన్న కదిలే వంతెనలో లోపాలు సరి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

No comments:

Post a Comment