బాలకృష్ణ గెలుస్తాడు...జెసి
హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తే గెలుపొందటం ఖాయమని మాజీ
మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం
అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లాలో మాత్రం బాలయ్య ప్రభావం ఉండదన్నారు.
కాగా జిల్లాలో మరోసారి కాంగ్రెసు పార్టీలో వర్గ పోరు బహిర్గతమైంది. జిల్లా
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం మాజీ
మంత్రి జెసి దివాకర్ రెడ్డిపై విరుచుకు పడగా, జెసి ప్రభాకర్ రెడ్డి
పాటిల్కు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో జెసి దివాకర్
రెడ్డి తనను కావాలనే ఓడించారని పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు.
టిడిపి అభ్యర్థిని గెలిపించినందుకు ప్రతిఫలంగా జెసి అల్లుడికి ఆ పార్టీ
అధిష్టానం రాయదుర్గం ఇంచార్జ్ పదవి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. తనను
ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించిన జెసిపై అధిష్టానానికి ఫిర్యాదు
చేస్తానని చెప్పారు. పాటిల్ వ్యాఖ్యలపై జెసి సోదరుడు ప్రభాకర్ రెడ్డి
స్పందించారు.ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని ఎదురుదాడికి దిగారు.
తమ బంధువు టిడిపి పార్టీలో ఉంటే తమకేం సంబంధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో
పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓటమికి స్థానిక మంత్రుల అసమర్థతే కారణమన్నారు.
గెలిస్తే మీ గొప్పతనం ఓడిపోతే మా వైఫల్యమా అని ప్రశ్నించారు. రాయదుర్గం ఉప
ఎన్నికల్లో ఖచ్చితంగా పాటిల్ ఓడిపోతారన్నారు. కాగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై కాంగ్రెసు అభ్యర్థి పాటిల్
ఓడిపోయిన విషయం తెలిసిందే
No comments:
Post a Comment