రాలయసీమ జిల్లాలో ఎడాపెడా విద్యుత్ కోత ‘ఉపాధి’కి వాత!
జిల్లాలో ఇష్టానుసారంగా అమలవుతున్న విద్యుత్ కోతల కారణంగా ఉపాధికి కోత
పడుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తిపరంగా దెబ్బతింటున్నాయి.
చిరు వ్యాపారులపై కూడా విద్యుత్ కోత ప్రభావం తీవ్రంగా పడింది. ఫోటోస్టాట్,
ఫోటోస్టూడియోలు, వెల్డర్లు, మెకానిక్కులు విద్యుత్ కోత కారణంగా తీవ్రంగా
నష్టపోతున్నారు. వీరు విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో రోజుకు 300 నుండి 500
రూపాయల వరకు స్వయం శక్తితో అదాయాన్ని సమకూర్చునేవారు. ప్రస్తుతం జిల్లాలో
విద్యుత్కోత దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగుతుండడంతో వ్యాపారాలు జరక్క
చేతి పనుల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో చేనేత
కార్మికులు పని దక్కక వచ్చే అరకొర కూలీ కూడా దక్కకపోవడంతో తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. గతంలో ఒక పట్టుచీరను నేస్తే 500 వందల రూపాయలు కూలీ
దక్కేది. ప్రస్తుతం విద్యుత్ కోత పేరుతో కూలీ చార్జీ 500 వందల నుండి 400
రూపాయల వరకు తగ్గించారు. దీంతో జిల్లాలో పట్టుచీరల ఉత్పత్తి బాగా
పడిపోయింది. జిల్లాలో వివిధ ప్రాంతాలలో వేలాది మంది చేనేత కార్మికులు
ఉన్నారు. ముందుగానే బాగా చితికిపోయిన చేనేత కార్మికులకు విద్యుత కోత
గోరుచుట్టుపై రోకలి పోటు అన్న చందంగా మారింది. ఇక పోతే వ్యవసాయదారులు కూడా
విద్యుత్ కోత వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో
విద్యుత్పై నడిచే చిన్న పరిశ్రమలు మూసివేత దిశగా నడుస్తున్నాయి. ముఖ్యంగా
నగర ప్రాంతాలలో వెల్డింగ్, లేత్ పనులు, విద్యుత్ పనులు పూర్తిగా
తగ్గిపోయాయి. చేతి వృత్తి కార్మికులు పని లేక పోవడంతో అంగళ్లల్లో ఖాళీగా
కూర్చుంటున్నారు. చేతి పనుల వారికి చేతి నిండా పని ఉన్నప్పటికీ విద్యుత్
లేకపోవడంతో పనులు సాగడడం లేదు. దీంతో యాజమానులు చేతి పనుల వారికి కూలీలు
తగ్గించి ఇస్తున్నారు. ఆ మేరకు ఆదాయం కోల్పోతున్నారు. రెక్కాడితే గాని
డొక్కాడని వారి పరిస్థితి గందరగోళంగా మారుతోంది.రాలయసీమ ప్రాంతాలలో మెకానిక్ షెడ్లు, ఆటోమొబైల్
సెంటర్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ కోత కారణంగా పనులు
ముందుకు సాగడం లేదు. దీంతో ఈ రంగాలపై ఆధారపడిన కార్మికులు అదాయం కోల్పోయి
లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో చేతి వృత్తి కార్మికుల జీవనం రోజురోజుకూ
భారంగా మారుతోంది.
No comments:
Post a Comment