మైదుకూరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేసింది. జిల్లాలో ఒక్క మేజర్ పంచాయతీకే ఈ అవకాశం దక్కింది. లింగాలదిన్నె, శెట్టివారిపల్లె పంచాయతీలతో పాటు యల్లంపల్లె పంచాయతీలోని నానుబాలపల్లె, రాయప్పగారిపల్లె, షాపూరు గ్రామాలను కలుపుతూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది
No comments:
Post a Comment