తిరుమలలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయం
సమీపంలో టిటీడీ మినీ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతుండడంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ
ఘటనలో 10 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదుగానీ,
సుమారు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని
మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్సర్య్యూట్వల్లే ఈ అగ్ని ప్రమాదం
జరిగినట్లు తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
చేపట్టారు.
No comments:
Post a Comment