సచిన్ టెండూల్కర్కు 39వ పడిలోకి అడుగుపెడితే అతనికిక అన్నీ మంచిరోజులేనని
కేరళకు చెందిన ఎంకే దామోదరన్ అనే ఓ జ్యోతిష్కుడు నొక్కి వక్కాణిస్తున్నాడు.
ఏప్రిల్ 24న సచిన్ పుట్టినరోజని, ఆ రోజు తర్వాత అతను వందో శతకం
సాధించేస్తాడని అన్నాడు. రాబోయే ఏడాదికాలంలో సచిన్ శతకాల సంఖ్య 102కు
చేరుతుందని కూడా చెబుతున్నాడు. కాబట్టి సచిన్ తొందరపడి రిటైర్మెంట్
ప్రకటించకూడదన్నాడు. భారత జ ట్టు 2011 వరల్డ్కప్ గెలుస్తుందని ముందే
చెప్పానన్నాడు.

No comments:
Post a Comment