Sunday, 19 February 2012

కడప జిల్లాలో పోలీసులు, ఖైదీల మధ్య ఘర్షణ

పోలీసులకు, బెయిల్‌పై విడుదలైన ఖైదీల మధ్య  రాత్రి ఘర్షణ చెలరేగింది. సంఘటనలో ఖాసీం అనే ఖైదీకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు సమీపంలో జరిగిన జంట హత్యల కేసుల్లో పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, ఖాసీం బెయిల్‌పై శుక్రవారం విడుదలయ్యారు. వెంటనే వారు గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి గ్రామానికి వెళ్లి.. ‘డీఎస్పీ పిలుస్తున్నారు. స్టేషన్‌కు రావాలని’ కోరారు. అయితే తాము ఇప్పుడు రాలేమని, ఉదయమే వస్తామని చెప్పడంతో ఎస్‌ఐ వారిపై కోప్పడ్డారు. దీంతో వారి మధ్య స్పల్ప ఘర్షణ జరిగినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. సంఘటనలో ఖాసీం తలకు గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మహమ్మద్ షరీఫ్ ఏమంటున్నారంటే...హత్య కేసుల్లోని నిందితులు బెయిల్‌పైగ్రామాలకు వెళ్లినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందులో భాగంగా జంట హత్యల కేసులోని పైన పేర్కొన్న నిందితులు బెయిల్‌పై గ్రామానికి వచ్చినట్లు తెలియగానే ముందు జాగ్రత్తగా పెద్దముడియం ఎస్‌ఐ నెమళ్లదిన్నెకు వెళ్లారు. పోలీసులకు సహకరించాల్సింది పోయి అడ్డం తిరగడం మంచిది కాదన్నారు.

No comments:

Post a Comment