Tuesday, 28 February 2012

శ్రీలంకపై భారత్ ఘన విజయం

 భారత్ - శ్రీలంక మద్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 86 బంతులలో (133)సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది తొమ్మిదవ సెంచరీ కాగా.. శ్రీలంకపై రెండవ సెంచరీ కావడం విశేషం. అంతక ముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు గాను 320 పరుగులు చేయగా.. 321 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రీలంక బౌలర్స్‌ని చితకబాదారు. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రాణించి సెంచరీ నమోదు చేయగా.. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 63 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక బౌలర్స్‌లలో మలింగ, మహారూఫ్ తలో వికెట్ తీసుకున్నారు.భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు.

No comments:

Post a Comment