Tuesday, 31 January 2012

బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్

అయితే నియామకాల సమయానికి డీఎడ్, బీఎడ్ అంటూ సమస్యను తెరపైకి తెచ్చి ప్రతిభా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. కోర్టు వరకు వెళ్లి ఏడాదిన్నరపాటు వ్యవహారం కొనసాగి, చివరకు డీఎడ్ 30, బీఈడీలకు 70 శాతం ఎస్‌జీటీ పోస్టులను కేటాయించి నియామకాలు జరిపారు. దీంతో ఎందరో ప్రతిభ చూపిన బీఈడీ అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా పోయాయి. ఆ తర్వాతనైనా ప్రభుత్వం ముందే కళ్లు తెరవలేదు. వచ్చే డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఎడ్‌లకే అని ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు బీఈడీ చేశారు. ముందే బీఈడీ చేసిన వారు వచ్చే డీఎస్సీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చని ఆశపడి చదువుతూ వచ్చిన వారికి నిరాశే మిగిలిపోయింది. అంతలోనే టెట్ విధానం తెరపైకి తెచ్చారు. ఇందులో పాసైతేనే డీఎస్సీ రాయడానికి అవకాశం అన్నారు. అయినా అభ్యర్థులు తమ రాత ఇలా ఉందనుకుని తొలి టెట్ పోటీ పరీక్ష రాశారు. ఆనాడు బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ట్లు రెండు పేపర్స్ రాయడానికి అవకాశం కల్పించారు. జనవరిలో రెండో టెట్ చేపట్టారు. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పేపర్-2 మాత్రమే రాయడానికి అర్హులని నిబంధన విధించారు. అనుకున్నట్లుగానే బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీలు అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఈ బీఈడీ అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. లబోదిబోమంటూ అభ్యర్థులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఆవేశం తట్టుకోలేక ప్రభుత్వం తీరుపై ఆందోళన చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. అసలు కథలోకి వెళితే ప్రభుత్వం రోజుకొక నిబంధన విధించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 2008 డీఎస్సీ నోటిఫికేషన్ కామన్‌గా విడుదల చేశారు.
అయితే నియామకాల సమయానికి డీఎడ్, బీఎడ్ అంటూ సమస్యను తెరపైకి తెచ్చి ప్రతిభా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. కోర్టు వరకు వెళ్లి ఏడాదిన్నరపాటు వ్యవహారం కొనసాగి, చివరకు డీఎడ్ 30, బీఈడీలకు 70 శాతం ఎస్‌జీటీ పోస్టులను కేటాయించి నియామకాలు జరిపారు. దీంతో ఎందరో ప్రతిభ చూపిన బీఈడీ అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా పోయాయి. ఆ తర్వాతనైనా ప్రభుత్వం ముందే కళ్లు తెరవలేదు. వచ్చే డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఎడ్‌లకే అని ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు బీఈడీ చేశారు. ముందే బీఈడీ చేసిన వారు వచ్చే డీఎస్సీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చని ఆశపడి చదువుతూ వచ్చిన వారికి నిరాశే మిగిలిపోయింది. అంతలోనే టెట్ విధానం తెరపైకి తెచ్చారు. ఇందులో పాసైతేనే డీఎస్సీ రాయడానికి అవకాశం అన్నారు. అయినా అభ్యర్థులు తమ రాత ఇలా ఉందనుకుని తొలి టెట్ పోటీ పరీక్ష రాశారు. ఆనాడు బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ట్లు రెండు పేపర్స్ రాయడానికి అవకాశం కల్పించారు. జనవరిలో రెండో టెట్ చేపట్టారు. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పేపర్-2 మాత్రమే రాయడానికి అర్హులని నిబంధన విధించారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం మీద 21335 మంది అభ్యర్థులు రాశారు. ఇందులో టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే అర్హులు. ప్రస్తుతం అధికారిక లెక్కల మేరకు జిల్లాలో 199 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే డీఎస్సీకి ఖాళీలు చూపారు. అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు ఈ పోస్టులకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. దీంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

No comments:

Post a Comment