Sunday, 1 January 2012

ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయో పరిమితి రెండేళ్లు పెంపు

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నూతన సంవత్సరం కానుక ప్రకటించారు. అన్ని కేటగిరీల్లో గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు. కొన్నేళ్ళుగా ఖాళీల భర్తీ జరగకపోవడం, ఇదే క్రమంలో ఇటీవల లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడంతో... వయో పరిమితి పెంచాలంటూ విన్నపాలు అందాయి. దీంతో అధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి మరో పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి కూడా ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.

No comments:

Post a Comment