ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రవ్యాప్తంగా మిల్క్ మిషన్
చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి
చెప్పారు. హైదరాబాద్లో ఫుడ్ 360 డిగ్రీస్ పేరిట జరుగుతున్న ఆహార ఉత్పత్తుల
సదస్సును సోమవారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో
కొద్ది కాలం క్రితం ప్రయోగాత్మక ప్రాతిపదికన పాల ఉత్పత్తి పెంపునకు ఒక
కార్యక్రమం ప్రారంభించామని ఆయన చెప్పారు. అదే కార్యక్రమాన్ని రాష్ట్ర
వ్యాప్తంగా విస్తరించడం ద్వారా గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం
ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.చిత్తూరు జిల్లాలో ఇందిరా
క్రాంతి పథం (ఐకెపి) ద్వారా గ్రామీణ మహిళలకు 3000 లీటర్ల వరకు సామర్థ్యం గల
బల్క్ కూలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం ద్వారా
లీటరు పాలకు మూడేళ్ల క్రితం లభించిన ఆరేడు రూపాయల ధర 20 నుంచి 21 రూపాయలు
వచ్చేలా చేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో రోజుకి 14 లక్షల
లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. దీనికి అనుబంధంగా పెరుగు,
ఫ్లేవర్డ్ మిల్క్ వంటి అనుబంధ ఉత్పత్తులు తయారుచేయడం ద్వారా వారు అదనపు
ఆదాయాలు కూడా పొందగలుగుతున్నారని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment