Tuesday, 6 December 2011
అనంతపురంలో డర్టీ సినిమా నిలిపివేత
శ్రీవారి సేవలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ
కేసులు.. విచారణలతో నిత్యం బిజీగా ఉండే సీబీఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీనారాయణ మంగళవారం శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల
వచ్చారు. ఉదయం తిరుమల చేరుకున్న ఆయన కాసేపు విశ్రాంతి పొందారు. అనంతరం
శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, జాపాలి, వేణుగోపాలస్వామి ఆలయం
తదితర సందర్శక ప్రాంతాలలో పర్యటించారు. రాత్రి విరామ సమయంలో ఆయన కుటుంబ
సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి త్వరలో పరీక్షలు
జరగనుండటంతో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు సమాచారం.
త్వరలో చిరంజీవి 150వ సినిమా మురుగదాస్ ద్శకత్వం?
పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జైదేవ్
సచిన్ టెండూల్కర్ ఒపస్ అభిమానుల నుండి భారీ స్పందన
శ్రీశైలం మల్లన్న గాలిగోపురానికి బీటలు
పాలకుల పర్యవేక్షణలోపం... అధికారుల నిర్లక్ష్యం వెరసి శ్రీశైలం మల్లన
గాలిగోపురం పాలిటశాపంలా తయారైంది. పురాతన కాలంనాటి ఆయలగోపురశిఖరాలపై అధికార
యంత్రాంగం నిర్లక్ష్యపు దోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలు
వెల్లువెత్తున్నాయి. శ్రీశైలం మల్లన్న గాలిగోపురం పిచ్చిమొక్కలతో
కళావిహీనంగా తయారైంది.
గాలి గోపురాన్ని పునరుద్ధరించే విషయంలో పాలకమండలి, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వెల్లువెత్తున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో గాలిగోపురాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గోపురాలపై ఉన్న శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ద్వారంగాఉన్న శివాజీ గోపురం శిధిలావస్థకు చేరుకుందని రెండేళ్లక్రితం నిపుణుల కమిటీ నిర్థారించింది. గోపురాన్ని పునరుద్ధరించాలనే సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గోపురం బీటలు వారుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గోపురాలపై శిల్పాలు విరిగిపోవడంతోపాటు పిచ్చిమొక్కలతో కళావిహీనంగా ఉన్నాయి. పురాతన కాలంనాటి శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారులు చొరవతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
గాలి గోపురాన్ని పునరుద్ధరించే విషయంలో పాలకమండలి, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వెల్లువెత్తున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో గాలిగోపురాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గోపురాలపై ఉన్న శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ద్వారంగాఉన్న శివాజీ గోపురం శిధిలావస్థకు చేరుకుందని రెండేళ్లక్రితం నిపుణుల కమిటీ నిర్థారించింది. గోపురాన్ని పునరుద్ధరించాలనే సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గోపురం బీటలు వారుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గోపురాలపై శిల్పాలు విరిగిపోవడంతోపాటు పిచ్చిమొక్కలతో కళావిహీనంగా ఉన్నాయి. పురాతన కాలంనాటి శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారులు చొరవతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
నిమ్స్ సెగలు కడప రిమ్స్ను కూడా తాకాయి
హైదరాబాద్ నిమ్స్ సెగలు కడప రిమ్స్ను కూడా తాకాయి. నిమ్స్లో ఖైదీలకు
వైద్యంపై జరిగిన కుంభకోణం లాంటిదే కడప రిమ్స్లోనూ చోటుచేసుకుంది. దీంతో
విచారణ జరిపిన సర్కార్, రిమ్స్ ఆర్ఎంఓ, సూపర్నెంట్లను సస్పెండ్ చేసింది. ఈ
వ్యవహారం కడపలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విచారణలో ఉన్న ఖైదీలకు
ఎలాంటి అనారోగ్యం లేకున్నా వైద్యం కోసం కడప రిమ్స్లో చేర్చుకున్నారు. అలాగే వారిని హైదరాబాద్ నిమ్స్కు రెఫర్ చేశారు. చాపాడు మండలం
శెట్టిపల్లికి చెందిన జయరాం రెడ్డితో పాటు, మరో ఇద్దరు ఓ మర్డర్ కేసులో
నిందితులు. విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని కడప రిమ్స్లో చేర్చుకోవడమే
గాకుండా మరింత వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు రిఫర్ చేశారు. ఈ ఘటనలో
నిమ్స్ వైద్యులు సస్పెండ్ కాగా, కడపలో కూడా విచారణ ఎదుర్కొంటున్న ఆర్ఎంఓ,
సూపర్నెంట్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ
చేశారు. రిమ్స్ వైద్యుల సస్పెన్షన్తో డాక్టర్ల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం
అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ప్రలోభాలకు లోబడి చికిత్సలకు రిఫర్
చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
Subscribe to:
Posts (Atom)