Showing posts with label పవన్ కళ్యాణ్. Show all posts
Showing posts with label పవన్ కళ్యాణ్. Show all posts

Sunday, 18 December 2011

మహేష్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్!

గూఢచారి 116 చిత్రంలో శోభన్ బాబు గెస్ట్ రోల్ లో కనపడతారు. ఆ పాత్రను పవన్ చేత చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మెహర్ రమేష్ వెళ్లి పనవ్ ని రిక్వెస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటివరకూ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ప్రాజెక్టు ప్రారంభమయ్యాక చూద్దామని దాటవేసినట్లు చెప్తున్నారు. అయితే అన్నీ కలిసి వచ్చి ప్రాజెక్టు ప్రారంభమయితే పవన్ చేసే అవకాశముందని చెప్తున్నారు. ఇక మహేష్ సైతం తాను ఇలాంటి మల్టిస్టారర్ చిత్రాల్లో చేయటానికి ఆసక్తి చూపెడుతున్నారు.పవన్ కళ్యాణ్,మహేష్ బాబు మంచి ప్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా కాలంగా ఉంటోంది. కానీ ఏ నిర్మాతకూ వీరిద్దరనీ భరించి తమ సినిమాలో పెట్టుకునే ధైర్యం లేదు. అయితే అలాంటి విచిత్రమొకటి భవిష్యత్ లో జరిగే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మహేష్ బాబుతో త్వరలో మెహర్ రమేష్ గూఢచారి 116 చిత్రాన్ని రీమేక్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.

Wednesday, 7 December 2011

‘పంజా’ సినిమా కు ‘A’సర్టిఫికెట్

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘పంజా’ మరో రెండు రోజుల్లో డిసెంబర్ 9న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత మూడు రోజుల క్రితమే సెన్సార్ పూర్తి చేసుకున్నప్పటికీ సర్టిఫికెట్ మాత్రం ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంతా భావించా....అందరినీ షాక్ కు గురి చేస్తూ సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు పెద్దలు మాత్రమే చూడతగినది అంటూ..‘A’సర్టిఫికెట్ జారీ చేశారు. వాస్తవానికి సెన్సార్ బోర్డు వారు కొన్ని కత్తెర్ల అనంతరం U/A సర్టిఫికెట్ ఇవ్వాలని చూశారు, అయితే పంజా దర్శక నిర్మాతలు కత్తెర్లకు ఒప్పుకోక పోవడంతో సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు.దీంతో ‘పంజా’ కేవలం పెద్దల వర్గానికి మాత్రమే పరిమితం అయిందని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పవన్ అభిమానులకు ఈ సినిమా చూసే హక్కు లేక పోవడం సర్వత్రా చర్చీనీయాంశం అయింది. సెన్సార్ బోర్డు వారు ఈ సర్టిఫికెట్ జారీ చేశారంటే...మితిమీరిన హింస, శృతిమించిన శృంగార సన్నివేశాలు గానీ ఈ సినిమాలో ఉన్నాయా? అనే అనుమానాలకు తావిచ్చినట్లయింది.అయినా ఈ కాలంలో, ముఖ్యమంగా మన రాష్ట్రంలో A సర్టిఫికెట్ ను ఎవరు పట్టించుకుంటున్నారు? మగధీర లాంటి సినిమాలకు A సర్టిఫికెట్ వచ్చినా....కుటుంబ సమేతంగా చూశారు. ఇప్పడు పంజా విషయంలో అదే జరుగుతుందని, A సర్టిఫికెట్ ఉన్నా...పెద్దగా పోయేదేం లేదని పంజా దర్శక నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది.

Tuesday, 6 December 2011

పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జైదేవ్

పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు జైదేవ్ అలియాస్ జై. కలకత్తా నేపథ్యంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ మరియు జాకీష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌-విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లోని ‘పంజా’లో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్‌ సందర్భంగా పంజా సినిమాలో బ్రహ్మానందం యాక్షన్ చాలా హైలెట్ గా ఉంటుందట. అసలు పంజా సినిమాలో బ్రహ్మనందం క్యరెక్టర్ కొత్తగా ఉంటుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.పంజా సినిమాలో పవన్ క్యరెక్టర్ తో పాటు ..బ్రహ్మనందం కూడా పోలిస్ ఇన్సెపక్టర్ పాపరావుగా నటిస్తున్నాడట. ఆయన నటనతో పంజా సినిమా కథ నడుస్తుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. గతంలో బ్రహ్మానందం నటించిన సినిమాలు చూస్తే.. ‘డీ’ మంచు విష్ణుతో, అలాగే ‘రెడీ’ సినిమాలో హీరో రామ్ తో కలిసి నటించి, బ్రహ్మానందం ఆ రెండు సినిమాలకు మంచి హిట్ తెచ్చిపెట్టాడు. ఆ రెండు సినిమాల్లో.. కథ మొత్తం బ్రహ్మానందం చుట్టు తిరుగుతుంది. సినిమా మొదటి నుండి చివరు వరకు ఆయన కామెడీతో.. ప్రేక్షకులను..ఆనందింప చేసిన విషయం తెలిసిందే.

Sunday, 4 December 2011

తొక్కలో ట్విట్టర్ : పవన్ కళ్యాణ్

ట్విట్టర్ లో రెగ్యులర్ గా ట్వీట్ చేసే వారిపై పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తూ విసుర్లు విసిరారు. ఆయన తాజాగా పంజా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ట్విట్టర్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను..బాగా అలిసి పోయాను..తిన్నాను..కూర్చున్నాను..గుడ్ మార్నింగ్..గుడ్ ఈవినింగ్ లాంటి కబుర్లే కదా...అంతకుమించి ట్విట్టర్ లో చెప్పుకునేందుకు ఏమీ లేదు. నాకు అలాంటివి పెద్దగా ఇంట్రస్ట్ ఉండవు..అందుకే నేను ట్విట్టర్ కు దూరం అని తేల్చి చెప్పారు. అలాగే ఇది విన్న కొందరు రెగ్యులర్ గా ట్విట్టర్ లో అప్ డేట్స్ ఇచ్చే హీరోలు,హీరోయిన్స్, దర్శకులు భుజాలు తడుముకున్నారు. ఇది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ ఆ ట్విట్టర్ హీరోలను భలే దెబ్బకొట్టాడని అంటున్నారు.

Friday, 2 December 2011

రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కనిపించని రేణుదేశాయ్

మెగా బ్రదర్స్ మధ్య మనస్పర్థలు నెలకొన్నాయనే వార్తలు జోరుగా ప్రచారం అయిన నేపథ్యంలో స్వయంగా రామ్ చరణ్ ని ఎంగేజ్ మెంట్ వేడుకకు పవన్ కళ్యాణ్ తీసుకురావడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు కలిసి కనిపించక పోవడంతో, రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ కు మనస్పర్ధలు వచ్చాయని వెబ్ మీడియా కోడై కూస్తుంది. ఎప్పటిలానే ఆ రూమర్స్ ను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కలిసి కనిపిస్తారని ఎదురుచూసిన కొందరు అభిమానులకు నిరాశే మిగిలింది. కానీ ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తో పాటు అతని భార్య రేణుదేశాయ్ పాల్గొనకపోవడం మాత్రం చర్చనీయాంశమయ్యింది. కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు విడాకులు వైపు అడుగులు వేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రేణు ఖండించింది.ఇటీవల పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పూణే నుంచి వచ్చిన రేణు అతనిని దగ్గరుండి చూసుకుందనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని, ఇకపై పవన్, రేణు కలిసే ఉంటారని జనాలు చెప్పుకున్నారు. కానీ నిన్న జరిగిన మెగా వేడుకలో చిరంజీవి కుటుంబసభ్యులు అందరూ పాల్గొనప్పటికీ..పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ ఈ వేడుకలో కనిపించక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, పవన్ కళ్యాణ్, రేణులు అవకాశం లేదని వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి.

Sunday, 13 November 2011

పవన్ తో ఓ సినిమా కోసం దిల్ రాజు వేట

పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అప్పటి నుంచి పవన్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం దిల్ రాజు దాదాపు పదకొండేళ్ళుగా ఎదురు చూస్తున్నాడట. అయితే ఆయన కల త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో పవన్ నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్లేస్ లో మహేష్ నటిస్తుండటంతో దిల్ రాజు పవన్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని నెలలుగా పవన్ చుట్టూ తిరుగుతున్న దిల్ రాజు చాలా సిట్టింగ్స్ జరిపారని ఈ మధ్యనే పవన్ ఓ స్క్రీప్ట్ ని ఫైనలైజ్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల కథనం. పవన్ వెంటపడి మరీ సాధించుకున్న దిల్ రాజుకి పవన్ తో సినిమా చేయాలనే పట్టుదలకు హాట్సాఫ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు

Wednesday, 9 November 2011

పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది




పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలు వారు విడిపోవడానికి కారణమయ్యాయని, చాలా కాలంగా రేణు దేశాయ్ పూణెలో తన పుట్టింట్లోనే ఉంటోందని, అప్పుడప్పుడు తనయుడు అఖీరానందన్ ఇక్కడికి రావడం తప్ప పవన్ తన భార్యని కలుసుకోలేదని పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఇప్పుడు వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలకి పరిష్కారం దక్కింది. పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది.
తానూ పవన్ కళ్యాణ్ వైవాహిక బంధం నుంచి విడిపోలేదని నటి ,డిజైనేర్ రేణు దేశాయ్ పేర్కొన్నారు .తామిద్దరం విడిపోయినట్టు వస్తోన్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు స్పష్టం చేసారు. తమ కుటుంబాన్ని పూణే కి మార్చినప్పటినుంచి ఈ విధమైన పుకార్లు వ్యాపించాయని ఆమె చెప్పారు.ఈ అర్ధం లేని పుకార్లు తనను ,పవన్ ను ఎంతగానో బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేసారు .ఈ పుకార్ల ప్రభావం తమ పిల్లల పై పడుతుందేమో అని భయం గా వుందని చెప్పారు.తాము 11 ఏళ్ళనుంచి పరస్పరం ప్రేమించు కుంటున్నామని భవిష్యత్ లోను అలాగే ఉంటామని రేణు అన్నారు 

Friday, 4 November 2011

పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ నవంబర్ 19కు వాయిదా వేసారు

                                               
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘పంజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను ఈ నెల 13న గచ్చిబౌలి స్టేడియంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుక వాయిదా పడే అవకాశముందనే వార్తలు అందుతున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాన్ 'పంజా' సినిమాకు సంగీత దర్శకుడుయువన్ శంకర్‌రాజా. యువన్ శంకర్‌రాజా మదర్ జీవా (58) గత సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. టి నగర్ స్వగృహంలో ఉండగా రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. కనుక ఈ సమయంలో ఆడియో వేడుకను జరపాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉన్నారు. కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఈ వేడుకను ఆపొద్దని యువన్ శంకర్ రాజా ఈ యూనిట్ కి చెప్పాడని సమాచారం. యువన్ శంకర్‌ రాజా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు.మొదట నవంబర్ 13న పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ అనుకున్నారు. లాస్ట్ మినిట్ వర్క్ చాలా వుంటుంది కాబట్టిపై కారణం వలన నవంబర్ 19కు వాయిదా వేసారు