Tuesday, 6 December 2011

సచిన్ టెండూల్కర్ ఒపస్ అభిమానుల నుండి భారీ స్పందన

సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి దేవుడు. క్రికెట్ రంగంలో భారతీయులు గర్వంగా చెప్పుకునే పేరు సచిన్. అలాంటి సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో సృష్టించని రికార్డు లేదు. దీంతో సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలను సంబంధించిన అరుదైన ఫోటోలతో రూపొందిస్తున్న 'సచిన్ టెండూల్కర్ ఒపస్' తొలి పుస్తకాన్ని సొంతం చేసుకునేందుకు గాను ఫేస్‌బుక్లో సచిన్ వీరభిమాని 3 లక్షల 50 వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. కోటి 80 లక్షలు)కు బిడ్ వేశాడు. సచిన్ ఒపస్ పేరుతో రూపొందించిన ఈ ఫేస్ బుక్ ఎకౌంట్‌ని సుమారు 50 లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఫేస్‌బుక్లో ఇండియాలో ఏఆర్ రెహామాన్ పేజి తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్న ఫేస్‌బుక్ పేజి ఇదే కావడం విశేషం. 2010వ సంవత్సరంలో ఈ పుస్తకం కోసం ఒక వ్యక్తి రూ 35. 2 లక్షలకు బిడ్ వేయడం జరిగింది. సచిన్ వందో సెంచురీ పూర్తి అయిన వెంటనే ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పుస్తకం 95 శాతం పూర్తి అయిందని ఒపస్ మీడియా గ్రూప్ సీఈవో కార్ల్ ఫోలర్ పేర్కొన్నారు.ఇక ఈ పుస్తకం విశేషాలను గనుక గమనించినట్లైతే 37 కేజీల బరువుతో పాటు 700 పేజీలు ఇందులో ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటి సారి ఓ క్రికెటర్‌పై పుస్తకం రావడం ఇదే మొట్టమొదటి సారి. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ కూడా 18*18 సైజులో ఉంటుంది. మంచి నాణ్యతతో రావాలనే ఉద్దేశంతో దీన్ని యంత్రాలతో కాకుండా చేతితోనే బైండింగ్ చేస్తున్నారు. సచిన్ గురించి ఆయా రంగాల్లో ప్రముఖుల వ్యాఖ్యానాలు ఉంటున్నప్పటికీ ఈ పుస్తకానికి ఫొటోలే ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇప్పటికే మాస్టర్‌ను ఏడడుగుల ఎత్తుండే పొలరాయిడ్ కెమెరాతో షూట్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ గ్జెనాన్ టెక్సేరియా ఈ ప్రాజెక్టులో పనిచేశాడు.

No comments:

Post a Comment